Close to 14 years after he first arrived on the international scene, former captain Mahendra Singh Dhoni continues to be the benchmark for top Team India cricketers where fitness is concerned.
ఐపీఎల్ 2018 సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి కళ్లు అంతర్జాతీయ క్రికెట్ వైపుకి మళ్లాయి. యూరప్ పర్యటనకు బయల్దేరడానికి ముందు టీమిండియా స్వదేశంలో ఆప్ఘనిస్థాన్ జట్టుతో చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ ఆడనుంది. జూన్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ టెస్టుకి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
అయితే, టీమిండియా తరుఫున ఆడాలంటే ప్రతి ఒక్క క్రికెటర్ తప్పకుండా ఫిట్నెస్ టెస్టు పాసవ్వాలి. లేదంలే అతడికి చోటు దక్కడం కష్టమే. గతేడాది యువీ, రైనా యో-యో టెస్టు విఫలమవ్వడంతో భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెటర్లకు మరో ఫిట్నెస్ పరీక్ష నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.