బీజేపీ ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీరు తాగిన కార్యకర్త, ఎందుకంటే?

Oneindia Telugu 2018-09-17

Views 110

Godda BJP MP Nishikant Dubey has landed himself in controversy for allowing a party worker to wash his feet and then drink the water that was used for washing the feet.
#BJPMP
#NishikantDubey
#wash
#drink
#water


బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పాదాలను ఓ కార్యకర్త కడిగారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. ఇందులో పవన్ షా అనే బీజేపీ కార్యకర్త.. సదరు ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీళ్లను తాగారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని కనహ్వారా గ్రామంలో చోటు చేసుకుంది. ఎంపీ ఓ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయమై గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో ఎంపీని ప్రసన్నం చేసుకునేందుకు కార్యకర్త తాంబాలంలో పాదాలు కడిగి నీళ్లు తాగాడు. నేతలను ప్రసన్నం చేసుకునేందుకు కిందిస్థాయి కార్యకర్తలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇది మాత్రం అందర్నీ విస్తుగొలుపుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS