తెలంగాణలో మరో రెండ్రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకరి పాలనపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ హైదరాబాద్ లో భారీ ఎత్తున ఫ్లెక్లీలు పెట్టారు. ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఫ్లెక్సీలపై ‘సాలు దొర’, ‘సంపకు దొర’ అంటూ స్లోగన్లు రాశారు. ఇది సహించని ప్రత్యర్తి పార్టీ లీడర్లు ఆ ఫ్లెక్సీలకు పోటీగా కటౌట్లను పెట్టారు.